గాయకి​ హరిణి కుటుంబం అదృశ్యం

గాయకి​ హరిణి కుటుంబం అదృశ్యం

హైదరాబాదు: గాయకి హరిణి కుటుంబం వారం రోజులుగా కనిపించకుండా పోయింది. వారు ఎక్కడున్నారన్నది తెలియరాకుండా ఉంది. వారి ఫోన్లు కూడా స్విచాఫ్ అయ్యాయి. వారం రోజులుగా హైదరాబాద్ లోని వారి ఇంటికి తాళం పెట్టి ఉంది. బంధువులు ఎంత ప్రయత్నించినా వారి ఆచూకీ తెలియరాలేదు. బెంగళూరులోని రైలు పట్టాలపై హరిణి తండ్రి ఎ.కె. రావు మృత దేహాన్ని కొన్ని రోజుల కిందట పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయి కనిపించారు. ఎ.కె. రావు మృతిపై బెంగళూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శరీరంపై కత్తి గాట్లుండడంతో హత్య కేసుగా నమోదు చేశారు. ఈ నెల 8న ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నెల 19న కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 23న ఆయన చనిపోయినట్టు బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. ఆ తర్వాత బెంగళూరులోనే అంత్యక్రియలు చేశారు. హరిణి కుటుంబ సభ్యులు బెంగళూరు రైల్వే పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. ఆర్థిక సంబంధ విషయాలే ఆయన హత్యకు పురిగొల్పి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్ సీఈవోగా ఎ.కె. రావు కొన్నాళ్లు పనిచేశారు. గాయకి, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా హరిణి పనిచేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో 3,500కుపైగా పాటలు పాడారు. మురారి, గుడుంబా శంకర్, ఘర్షణ, అల్లుడు శీను వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos