బాగ్పత్: నగరంలో మంగళవారం ఉదయం భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్ను ముగ్గురు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. సంజయ్ ఖోఖర్ ఒంటరిగా కాలినడకన తన పొలానికి వెళుతున్నపుడు దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే ఛప్రౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ఆరంభించారు. స్థానిక భాజపా నేతలు శాంతిభద్రతల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.