తిరువనంతపురం: ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న 30 కిలోల బంగారం గురించి కేంద్ర దర్యాప్తు సంస్థలచే సమగ్ర విచారణ జరిపిం చాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి పినిరాయ్ విజయన్ గురువారం లేఖ రాశారు. దేశ ఆర్ధిక వ్యవస్థను దిగజార్చే ఈ ఘటన గురించి అన్ని కోణాల్లో విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బంగారం అక్రమ రవాణా ఎక్కడ మొదలైంది? చివరిగా ఎవరి వద్దకు చేరుతుందనే వరకూ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలు బహిర్గతమేతేనై ఇలాంటి ఘటనలు మరలా జరగవని పేర్కొన్నారు.