గోల్డ్‌ స్కామ్‌ నిగ్గు తేల్చండి

గోల్డ్‌ స్కామ్‌ నిగ్గు తేల్చండి

తిరువనంతపురం: ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న 30 కిలోల బంగారం గురించి కేంద్ర దర్యాప్తు సంస్థలచే సమగ్ర విచారణ జరిపిం చాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి పినిరాయ్ విజయన్ గురువారం లేఖ రాశారు. దేశ ఆర్ధిక వ్యవస్థను దిగజార్చే ఈ ఘటన గురించి అన్ని కోణాల్లో విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బంగారం అక్రమ రవాణా ఎక్కడ మొదలైంది? చివరిగా ఎవరి వద్దకు చేరుతుందనే వరకూ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలు బహిర్గతమేతేనై ఇలాంటి ఘటనలు మరలా జరగవని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos