న్యూ ఢిల్లీ : ‘పెగాసస్ స్పైవేర్ వాడకం పై వివరాలు ఇవ్వలేం. దేశ భద్రతతో కూడుకున్న అంశమ’ని సుప్రీం కోర్టుకు సమాఖ్య ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణ 10 రోజులకు వాయిదా వేసింది. సోమవారం పెగాసస్పై సుప్రీం కోర్టులో ప్రభుత్వం ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. పెగాసస్ గూఢచర్యం ఆరోపణలను నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. పెగాసస్ ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతిపక్షాలు, జర్నలిస్టుల ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది.