రేయింబవళ్లు వ్యాపారాలు

రేయింబవళ్లు వ్యాపారాలు

ముంబై : ముంబైలోని దుకాణాలుఈ నెల 26 నుంచి రేయింబవళ్లు తెరిచే ఉంటాయి. పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే ఇటీవల షాపింగ్ మాల్స్, హొటల్స్, రెస్టారెంట్ల అధిపతులతోనూ, హొటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా (హెచ్ఆర్ఎడబ్ల్యుఐ) ప్రతినిధులతోనూ సమావేశమైన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ముంబై మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశీ, పోలీస్ కమిషనర్ సంజయ్ బార్వే, ఇతర సీనియర్ అధికారులు సమీవేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హెచ్ఆర్ఎడబ్ల్యుఐ అధ్యక్షుడు గురుబక్షీస్ సింగ్ కొహ్లి స్వాగతించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos