గంజాయి విక్రేతల అరెస్టు

గంజాయి విక్రేతల అరెస్టు

హొసూరు : పట్టణంలోని పలు ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పట్టణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా బస్టాండు, ప్రభుత్వ ఆసుపత్రి, తాలూకా ఆఫీసు రోడ్డు తదితర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న నవాజ్, బర్కత్, నూర్ అహ్మద్, సురేష్ అనే నలుగురిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న కిలో గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. తదనంతరం కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos