హోసూరు:ఇక్కడకు సమీపంలోని బయనపల్లి వినాయక దేవాలయం లో శనివారం మండల పూజలు అతి వైభవంగా నిర్వహించారు. గత వారం రోజులుగా స్వామి వారికి రకాల అభిషేకాలు, విశేష పూజలు చేసారు. చివరి రోజైన శని వారం వంద మందికి పైగా మహిళలు పాల కలశాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారి అభిషేకించారు. తరువాత వినాయకునికి కర్పూర హారతి, దీపారాధన, భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు.