భారత రత్న కంటే గాంధీయే గొప్ప

భారత రత్న కంటే గాంధీయే గొప్ప

న్యూడిల్లీ : మహత్మా గాంధీ భారత రత్నను మించిన మహోన్నత వ్యక్తి అని అత్యున్నత న్యాయ స్థానం శుక్రవారం వ్యాఖ్యానిం చింది. మహాత్మా గాంధీకి భారతరత్నపురస్కారాన్ని ప్రదానం చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని సూచించాలని దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టి వేసింది. ఈ విషయంలో కేంద్రానికి అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. ‘ప్రజలు గాంధీని మహోన్నత స్థాయిలో గుర్తించి జాతి పితగా నిలిపారు. గాంధీ మహోన్నతమైన వ్యక్తి. ఆయనకు ఉన్న గుర్తింపు చాలా గొప్పదని కోర్టు తెలిపింది. దేశంలో భారతరత్న అవార్డు అత్యున్నతమైనది. అయితే భారత రత్న బిరుదు కంటే గాంధీజీకి ఉన్న గుర్తింపు మహోన్న తమైనది. గాందీకి భారతరత్న ఇవ్వడం అంటే ఆయన్ను, ఆయన సేవలను తక్కువ చేసి చూసినట్లు అవుతుంద’ని ప్రధాన న్యాయమూర్తి శరద్ అర్వింద్ బాబ్డే పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos