న్యూ ఢిల్లీ : ఐసిస్ కశ్మీర్ నుంచి ఈ-మెయిల్ ద్వారా హత్య బెదిరింపులు వస్తున్నాయని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. బెదిరింపులకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. గంభీర్ నివాసం వెలుపల పోలీసులు భద్రతను పెంచారు. ఆయన లోక్సభలో తూర్పు ఢిల్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహి స్తున్నాడు.