తిరువనంత పురం: కరోనా వల్ల తొలి మరణం శనివారం సంభవించింది. 69 ఏళ్ల వ్యక్తి ఒకరు కొచ్చి వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం మృతి చెందినట్లు ఎర్నాకుళం జిల్లా వైద్యాధికారి డా.ఎన్కే కుట్టప్పన్ ప్రకటించారు. కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు 176 రోగుల్లో 163 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 12 మంది ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు.