హొసూరు : కరోనా ఎఫెక్ట్ కారణంగా 144వ సెక్షన్ను విధించడంతో హోటళ్లు, దుకాణాలు మూతబడి నగరమంతా నిర్మానుష్యంగా మారింది. వీధి కుక్కలకు ఆహారం కరువైంది. వీటి పరిస్థితిని గమనించిన హొసూరు వన్యప్రాణుల సంరక్షణ సంఘం ఆహారం అందించాలని నిర్ణయించింది. వీధుల్లో
తిరుగుతున్న కుక్కలకు ఆహారం పెట్టి సంఘం సభ్యులు వాటి ఆకలి తీర్చారు. వన్యప్రాణుల సంరక్షణ సంఘం కార్యకర్తల విశాల హృదయాన్ని పట్టణంలోని పలువురు ప్రశంసించారు. సుమారు 200 కుక్కలకు అన్నం పెట్టి వాటి ఆకలి తీర్చారు.