పైలెట్ పై వేటు

పైలెట్ పై వేటు

జైపూర్ : తిరుగుబాటు నేత సచిన్ పైలట్ను రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్ష, ఉపముఖ్యమంత్రి పదవుల నుంచి తొలగించినట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఆయన స్థానంలో గోవింద్ సింగ్ డోటాస్రాను నియమించినట్లు వెల్లడించారు. రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభా పక్షం నిర్వహించిన సమావేశంలో పైలట్ను పార్టీ నుంచి తొలగించాలని 102 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభానికి భాజపానే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్ని భాజపా ప్రలోభానికి గురి చేసిందన్నారు. సచిన్ పైలెట్ వర్గంపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos