అసోం రైఫిల్స్ పై కాల్పులు

అసోం రైఫిల్స్ పై  కాల్పులు

గౌహతి : తిరప్, చాంగ్ లాంగ్ జిల్లాల్లోని సరిహద్దుల్లో మయన్మార్ మిలిటెంట్లు మంగళ వారం ఉదయం అసోం రైఫిల్స్ జవాన్లపై క్యా, ఉల్ఫా మిలిటెంట్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనెడ్లు, బాంబులతో దాడి చేశారు. ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసరు చేతికి స్వల్ప గాయమైంది.మయన్మార్ సరిహద్దుల్లో గస్తీలోని అసోం రైఫిల్స్ జవాన్లు మిలిటెంట్ల దాడిని తిప్పికొట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసోం రైఫిల్స్ బలగాలను మయన్మార్ సరిహద్దుల్లో మోహరించారు.స్వాతంత్ర్య దినోత్సవాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేసి కాల్పులు జరిపారు. మయన్మార్ సరిహద్దుల్లోని మారుమూల పంగసు ప్రాంతంలోనూ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. నాగాలాండ్ జిల్లా నోకలాక్ జిల్లాలోనూ మిలిటెంట్లు కాల్పులు జరిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos