హైదరాబాద్ : సంక్రాంతి ప్రయాణం మొదలైంది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. జనరల్ బోగీల్లో సీట్ల కోసం ప్రజలు పోటీలు పడ్డారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలోనూ రద్దీ నెలకొంది.