శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో రూ.113 కోట్ల నిధుల దుర్వినియోగం గురించి మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను ఈడీ నగరంలో సోమవారం ప్రశ్నిస్తోంది. చేస్తున్నారు. ఈ కేసు విచారణను కోర్టు సీబీఐకి అప్పజెప్పింది. ఆ తర్వాత దీనిపై ఈడీ ఓ కేసును నమోదు చేసింది. తమ ఇంటిపై ఈడీ ఎలాంటి దాడులు చేయలేదని ఫరూక్ కుమారుడు ఒమర్ ప్రకటించారు. ఈడీ సమన్లకు సమాధానం ఇస్తామని తెలిపారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరణకు కొత్త కూటమి ఆవిర్భవించినందున కేంద్రం ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఒమర్ విమర్శించారు.