విస్తరణలో కొందరికే ఛాన్స్

విస్తరణలో కొందరికే ఛాన్స్

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కే.
చంద్రశేఖర రావు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రూపొందించిన జాబితాలో
హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు విస్తరణలో అవకాశం లభించనుంది. తొమ్మిది
మంది  పేర్లు ఖరారైనట్లు కూడా సమాచారం. కేటీఆర్‌కు
పూర్తిగా పార్టీ బాధ్యతలకే పరిమితం చేయనున్నారని తెలిసింది. ఇటీవలే ఆయనను పార్టీ కార్య
నిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు మళ్లీ అవకాశం దక్కనుంది.
హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు అవకాశం లేనట్లేనని సమాచారం. మెదక్‌ జిల్లా నుంచి సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. మహిళా, గిరిజన కోటా కింద ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. చోటుదక్కని పలువురు ఆశావహులతోనూ సీఎం ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప ఈ జాబితాలో మార్పులుండవని తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos