భయపెడుతున్న ఒంటరి ఏనుగు

భయపెడుతున్న ఒంటరి ఏనుగు

హోసూరు : కృష్ణగిరి జిల్లా సమీపంలో రోడ్డు పక్కన సంచరిస్తున్న ఒంటరి ఏనుగు వల్ల వాహన చోదకులు భయాందోళనలకు గురవుతున్నారు. డెంకనికోట సమీపంలోని నొగనూరు అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా 20కి పైగా ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ఏనుగుల మంద నుండి విడిపోయిన ఓ ఏనుగు డెంకనికోట అంచెట్టి రోడ్డు మరగట్ట గ్రామం వద్ద రోడ్డు పక్కన సంచరిస్తున్నది. గత కొద్దిరోజులుగా ఒంటరి ఏనుగు రోడ్డు పక్కన సంచరిస్తున్నందున వాహన చోదకులు భయాందోళనలు చెందుతున్నారు. వారం రోజులుగా ఏనుగు రోడ్డు పక్కన సంచరిస్తు న్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పక్కన సంచరిస్తున్న ఏనుగును తరిమివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos