విద్యుత్ కోతలు అంటూ తప్పుడు ప్రచారం

విద్యుత్ కోతలు అంటూ తప్పుడు ప్రచారం

అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ కోతలు అంటూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ ఇంధన శాఖ విమర్శించింది. లోడ్ రిలీఫ్ పేరిట గ్రామాలు, పట్టణాల్లో కోతలు విధిస్తున్నారనడంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. బొగ్గు లభ్యత, నిల్వలు, సరఫరా తదితర అంశాలు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని, ఇది ఏ ఒక్క రాష్ట్రానికో కాకుండా, అంతర్జాతీయంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని వివరించింది. అయినా రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందజేసేందుకు డిస్కంలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, దీనిపై ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపింది. ఏపీ జెన్ కో బొగ్గు కొనుగోలుకు ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. దేశంలో ఎక్కడ్నించైనా బొగ్గు కొనుగోలు చేయాలని ఆదేశాలు అందాయని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos