భాజపా, శివసేనలకు హిందూ సంఘాల హెచ్చరిక

భాజపా, శివసేనలకు హిందూ సంఘాల హెచ్చరిక

ముంబై: బీజీపే-శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సమస్త హిందూ అఘాడి అధ్యక్షుడు మిలింద్ ఏక్టోబే గురువారం ఇక్కడ సూచించారు. బీజేపీ, శివసేన పార్టీలు విడివిడిగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ, శివసేనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని వెల్లడించారు. హిందూ మహాసభ, హిందూ జాగృతి సమితి, హిందూ రాష్ట్ర సేన తదితర హిందూ సంఘాలు సంయుక్తగా ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖ రుల సమావేశంలో మాట్లాడారు. వివాదాల్ని మరచి బీజేపీ, శివసేన పార్టీలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos