న్యూఢిల్లీ: వంట నూనెలపై కేంద్రం దిగుమతి పన్ను తగ్గించింది. దీంతో వాటి ధరలు ఇరవై శాతం వరకూ తగ్గుతాయని ఆర్థిక శాఖ గురువారం ఇక్కడ వెల్లడిం చింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయని లో పేర్కొంది. పామాయిల్, సోయా ముడి చముర్లపై దిగుమతి సుంకాన్ని టన్నుకు వరుసగా 87, 37 డాలర్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం దీని ధర టన్నుకు 1415 డాలర్లుగా ఉంది. అటు దేశీయంగా ఆవాలు, సోయాబీన్, వేరుశనగల రేట్లు కూడా దిగనున్నాయి.