న్యూ ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో వచ్చే నెల 10న ఇక్కడి తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ శుక్రవారం టీపీసీసీ నేతలు ఐదుగురుకి తాఖీదులు జారీ చేసింది. వారు- కీలక కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ‘నాకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు రాలేదు. ఒక వేళ వస్తే విచారణకు హాజరు అవుతాన’ని షబ్బీర్ అలీ చెప్పారు.