ముంబై: మహారాష్ట్రలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారు జామున 5.09 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత గల భూకంపం నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. హింగోలి జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. భూఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం హింగోలి జిల్లా హైదరాబాద్కు 255 కిలోమీటర్లు, నాగ్పూర్కు 265 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం నమోదుకాలేదు.