అతణ్ని పట్టుకుంటే రూ.2.5 లక్షలు

అతణ్ని  పట్టుకుంటే రూ.2.5 లక్షలు

లక్నో : ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గూండా వికాస్ దూబే ను ప్రాణాలతో పట్టిచ్చిన వారికి ప్రకటించిన నగదు బహుమతిని రూ.2.5 లక్షలకు పెంచారు. అనుచరులను పట్టిస్తే రూ. 50 వేల నగదు ఇస్తామని సోమ వారం ఉత్తర ప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ అవస్థీ తెలిపారు. భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చెక్ పోస్ట్ వద్దా దూబే ఫోటోను ఉంచారు. అతని ఆచూకి తెలిపినవారి వివరాలను రహస్యం ఉంచడంతో పాటు నగదు బహుమతి అందిస్తామని పేర్కొన్నారు. దూబే చివరి సారిగా ఆరయ్య ప్రాంతంలో సంచరించినట్లు సమాచారం. అతను మధ్యప్రదేశ్ లేదా రాజస్తాన్ పారిపోయినట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు. వికాస్ దూబే ప్రధాన అనుచరుడు దయా శంకర్ అగ్ని హోత్రిని పోలీసులు కల్యాణ్ పూర్ లో అరెస్టు చేసారు. దూబేను పట్టు కునేందుకు 25 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos