అందుకే ఎన్‌కౌంటర్‌..

అందుకే ఎన్‌కౌంటర్‌..

అత్యంత క్రూరంగా దిశను హత్యాచారం చేసిన నిందితులను సైబరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఈ ఎన్‌కౌంటర్‌తో ఏళ్ల తరబడి సాగుతున్న అత్యాచార కేసుల్లో నిందితులను సైతం ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.కాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ వెనుక పలు ఆసక్తికర విషయాలు దాగున్నాయని సమాచారం.దిశ హత్యాచార ఘటనలో మహ్మద్‌ ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌,శివలు నేరస్థులే అయినా వారే నేరస్థులని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లభించలేదు.నిందితులే హత్యాచారం చేశారని కోర్టులో నిరూపించడానికి ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవు.నిందితులు నేరం చేశారని చెప్పడానికి, నిరూపించడానికి కావలసిన బలమైన ఆధారాలు లేవు.దిశ శరీరం పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో డీఎన్ఏ పరీక్ష చేయడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి.ఒకవేళ విచారణలో నేరం చేసినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చినా చిత్రహింసలకు గురి చేసి బలవంతంగా ఇప్పించారని మాట మార్చే అవకాశం ఉంది.ఇలా అన్ని కోణాల్లోనూ నిందితులు కేసు నుంచి తప్పించుకోవడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.చదువుకోకపోయినా తాగిన మైకంలో నిందితులు కేసు నుంచి బయటపడడానికి పక్కాగా సాక్ష్యాధారాలు లభించకుండా జాగ్రత్తపడ్డారు.దీంతో నిందితులను అరెస్ట్ చేసినా వీరే నేరస్థులు అని నిరూపించడానికి కోర్టులో దాఖలు చేయడానికి కావలసిన ఆధారాలు చాలా బలహీనంగా ఉన్నాయి.దీంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.ఇదిలా ఉంటే దిశ తరహాలో గుర్తు తెలియకుండా కాలిపోయిన యువతులకు సంబంధించి కర్ణాటక.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో చోటు చేసుకున్న ఉదంతాల్ని విశ్లేషిస్తున్నామని.. తీవ్రమైన నేరాలతో దిశ నిందితులకు లింకు ఉంటుందని భావిస్తున్నట్లు కమిషనర్‌ సజ్జనార్‌ చెప్పారు. ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని.. ఆధారాలు లభించే అవకాశం ఉందని చెప్పారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos