ధోనీ కొత్త వ్యాపారం

  • In Sports
  • November 14, 2020
  • 130 Views
ధోనీ కొత్త వ్యాపారం

రాంచీ: భారత జట్టు మాజీ కెప్టెన్ రాంచీలోని తన 43 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వచ్చే నెలలో కోళ్ల ఫారాన్ని ప్రారంభించనున్నాడు. ఇందుకోసం రెండు వేల కడఖ్నాథ్ కోళ్లను మధ్యప్రదేశ్లోని జబువా జిల్లా కేంద్రం నుంచి తన వ్యవసాయ క్షేత్రానికి తెప్పిస్తున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ఓటమి పాలైనప్పటి నుంచి క్రికెట్కు దూరంగా ఉన్న ధోనీ, ఈ విరామ సమయంలో సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. కూరగాయలు, వివిధ రకాల పండ్లు పండించడంతో పాటు హరియాణాకు చెందిన సహీవాల్ ఆవులతో డెయిరీ, వ్యవసాయ క్షేత్రంలోని ఒక పెద్ద చెరువులో చేపల పెంపకం కూడా చేస్తున్నాడు. ఇప్పుడు వీటన్నింటితోపాటు కడఖ్నాథ్ కోళ్ల పెంపకాన్ని కూడా చేపట్టనున్నాడు. పోషక విలువలు అధికంగా ఉండే ఈ కోడిమాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos