ఎ. సామనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి పనులు

ఎ. సామనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి పనులు

హోసూరు : సూలగిరి యూనియన్ ఎ. సామనపల్లి గ్రామంలో రూ.5.40 లక్షల ఖర్చుతో మల్టీ పర్పస్ భవన నిర్మాణానికి హోసూరు ఎమ్మెల్యే సత్య భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. హోసూరు నియోజక వర్గంలోని ఎ. సామనపల్లి గ్రామంలో మల్టీపర్పస్ భవనం నిర్మించాలని గ్రామస్థులు గతంలో హోసూరు ఎమ్మెల్యే సత్యను కోరారు. గ్రామస్థుల కోరిక మేరకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 5.40 లక్షలు నిధులను కేటాయించారు. సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు డిఎంకె పార్టీ నేత లు, గ్రామస్థులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos