హోసూరు : ఇక్కడి బిడిఓ కార్యాలయంలో దసరా పండుగ పూజలను ఘనంగా నిర్వహించారు. హోసూరు యూనియన్ చైర్పర్సన్ శశి వెంకటస్వామి నేతృత్వంలో దసరా పూజలు చేశారు. యూనియన్ కార్యాలయాన్ని అలంకరించి వాహనాలకు పూజలు నిర్వహించారు. కార్యాలయంలో దేవుళ్ళ చిత్రపటాన్నుంచి పూజలు నిర్వహించారు. తరువాత కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి, ప్రజలకు శశి వెంకటస్వామి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బిడిఓ రామచంద్రన్, జిల్లా కౌన్సిలర్ రవికుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.