రైనాకు స్వస్తి పలికిన చెన్నై!

  • In Sports
  • September 29, 2020
  • 169 Views
రైనాకు స్వస్తి పలికిన చెన్నై!

ఐపీల్ లో సురేష్ రైనా ఆట తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.టీమిండియా కంటే చెన్నై తరఫునే ఆడుతూ అత్యధిక పరుగులు అత్యధిక విజయాలు అందించాడు. మొన్నటిదాకా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ జాబితాలో రైనా దే అగ్రస్థానం. ఇటీవలే ఈ రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. ఈ సీజన్లో రైనా బరిలోకి దిగి ఉంటే తన అగ్రస్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేవాడు. తన ఆటతీరుతో చెన్నైకి ఎన్నో విజయాలు ఇచ్చిన రైనా వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ టోర్నీ నుంచి వైదొలగి ఇంటికి చేరుకున్నాడు.రైనా గైర్హాజరీ తో చెన్నై బ్యాటింగ్ లో కాస్త బలహీనపడింది. దానికితోడు వరుసగా చెన్నై జట్టుకు రెండు పరాజయాలు ఎదురవడంతో అయినా తిరిగి రావాలని అభిమానులు కోరుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు అభిమానులు చిన్న తల తిరిగి రా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇన్నాళ్ళు రైనా ఇండియాలో తమ బంధువుల పై దోపిడీ దొంగల దాడి జరగడంతో నే తిరిగి ఇంటికి వచ్చాడని అందరూ భావించారు.కానీ చెన్నై జట్టు యాజమాన్యంతో అతనికి తలెత్తిన విభేదాల వల్లే రైనా టోర్నీ నుంచి వైదొలిగాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను రైనాతోపాటు చెన్నై జట్టు యజమాని శ్రీనివాసన్ కూడా కొట్టి పారేసారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు ఏవీ లేవని క్లారిటీ ఇచ్చారు. దీంతో మళ్లీ రైనా దుబాయ్ వచ్చి జట్టులో చేరతాడని అంతా భావించారు. దీనికి తగ్గట్లే ఇటీవల రైనా మరోసారి ఐపిఎల్ ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేయడంతో అయినా రాక ఇక లాంఛనమే అని అనుకున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు యాజమాన్యం తమ అధికారిక వెబ్ సైట్ నుంచి సురేష్ రైనా పేరు తొలగించింది. అలాగే దుబాయ్ కి రాని హర్భజన్ సింగ్ పేరు కూడా తీసేసింది. ప్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయంతో రైనా ఇక ఐపీఎల్లో ఆడటం కష్టమేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos