మ్యాచ్ ఫిక్సింగ్ లేకుంటే చెన్నై పరిస్థితి ఇదే..

  • In Sports
  • September 30, 2020
  • 166 Views
మ్యాచ్ ఫిక్సింగ్ లేకుంటే చెన్నై పరిస్థితి ఇదే..

ఐపీల్ లో ఎన్నడూ లేని విధంగా చెన్నై జట్టు అట్టడుగు స్థానంలో నిలవడం ఐపీల్ అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది.ముఖ్యంగా తమిళ తంబీలు దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.దీంతో ఇప్పటి వరకు ధోనిని పొగిడిన తంబీలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.నిన్నటి మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ పై 15 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం సాధించడంతో చెన్నై జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది. సగం జట్లు మూడు మ్యాచ్ లను పూర్తి చేయగా, మిగతా జట్లు రెండు మ్యాచ్ లను ఆడాయి. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గెలిచిన చెన్నై జట్టు, ఆపై ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓటమి పాలైంది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ లేకుంటే చెన్నై పరిస్థితి ఇదేనని, పాయింట్ల టేబుల్ లో జట్టు చివరి స్థానంలో ఉండటానికి ధోనీయే కారణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos