హైదరాబాద్: ప్రధాని మోదీ నగర పర్యటన సందర్భంగా పోలీసులు సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి, పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు హిమా యత్ నగర్లో సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద నల్ల చొక్కాలతో సీపీఐ ఆందోళనకు దిగింది. మోదీ ఎనిమిదేళ్ళ పాలనలో దేశం వందేళ్ళు వెనక్కి వెళ్ళిందని మండిపడ్డారు. మతవిధ్వేషాలను రెచ్చగొట్టి మళ్ళీ మోదీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.