హైదరా బాద్ : కరోనా నివారణకు మందు కని పెట్టామని ప్రజలను మోసం చేస్తున్న రాందేవ్ బాబాను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ శుక్ర వారం ఇక్కడ డిమాండ్ చేశారు. మందు కనుక్కొనేందుకు భారత్, ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తుండగా యోగాసనాలు వేసుకునే రాందేవ్ బాబా తన దగ్గర మందుందని ప్రకటించడం దారుణమని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే కళ్లు తెరచి ఈ బాబాను అరెస్టు చేయడంతో పాటు పతంజలి సంస్థపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేసారు.