చిరంజీవి ఊసరవెల్లి, పనవ్ కళ్యాణ్‌ నేల పాతర

తిరుపతి: మెగాస్టార్ చిరంజీవి ఊసరవెల్లి, పనవ్ కళ్యాణ్ ఒక నేల పాతర అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభివర్ణించారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘భీమవరంలో ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవానికి సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానిస్తే చాలా బాగుండేది. ఊసరవెల్లిలా వ్యవహరించే చిరంజీవిని వేడుకకు ఆహ్వానించడం సరికాదు. పవన్ కల్యాణ్ ఒక ల్యాండ్ మైన్ వంటి వారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలియద’న్నారు. ‘ఏపీ నాయకులను బీజేపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో నేతలు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయకపోయినా ఎన్డీయే ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ, టీడీపీ ఎందుకు ఓట్లు వేశాయి? రాజధాని అమరావతి అనే భావనను పోగొట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది. రాజధాని కావాలనే ఆలోచన కూడా వైసీపీ నేతలకు లేదు. ఇప్పటికీ హైదరాబాద్ నే రాజధానిగా వారు భావిస్తున్నార’ని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos