కరోనా విజృంభణ

కరోనా విజృంభణ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న 25 వేలకు పైగా కేసులు నమోదు కాగా, తాజాగా, గత 24 గంటల్లో 26,500 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 8 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 21 వేల మైలు రాయిని చేరుకుంది. దేశంలోని మొత్తం కేసులలో 60 శాతం మహారాష్ట్ర, ఢిల్లీలోనే నమోదవుతుండడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పటికీ, ఇటీవల వరుస సడలింపులతో దేశీయ విమాన సర్వీసులు, ప్రత్యేక రైళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు వంటివి తెరుచుకున్నాయి. పలు కార్యాలయాలు కూడా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాయి. సడలింపుల తర్వాత కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడంతో కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నాయి. మహారాష్ట్రలోని పారిశ్రామిక పట్టణమైన ఔరంగాబాద్లో 9 రోజులపాటు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వాహన తయారీ సంస్థలపై పెను ప్రభావం చూపుతోంది. నేటి నుంచి రెండు రోజులపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా లాక్డౌన్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిన్నటి నుంచే లాక్డౌన్ ప్రకటించింది. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే యోచనలో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos