కరోనా కట్టడిలో ఇరుగు పొరుగు మేలు

న్యూ ఢిల్లీ : కరోనా కట్టడిలో భారత్ కన్నా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ముందున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసారు.2020-21 ఏడాదిలో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, చైనా, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, భారత్ల వృద్ధి అంచనాల పట్టికను తన ట్వీట్కు జత చేశారు.‘ భాజపా ప్రభుత్వం సాధించిన మరో అతిపెద్ద ఘనత ఇది. కరోనా మహమ్మారిని భారత్ కన్నా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్లే బాగా కట్టడి చేయగలిగాయ’ని ఎద్దేవా చేసారు. భారత వృద్ధిపై ఐఎంఎఫ్ విడుదల చేసిన అంచనాలను ఉల్లేఖించి గత బుధవారం కూడా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. జీడీపీ తలసరి ఆదాయంలో భారత్కు పొరుగుదేశం బంగ్లాదేశ్ చేరువైందని ఎద్దేవా చేశారు. ఇది 6 సంవత్సరాల భాజపా విద్వేష పూరిత జాతీయవాద రాజకీయాల ఫలితమే అని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది సుమారు 10.3 శాతం మేర క్షీణిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) అంచనాలను ఉల్లేఖించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos