లక్నో: హథ్రాస్ అమానుషానికి నిరసనగా వాల్మీకి కులానికి చెందిన 50 కుటుంబాల సభ్యులు 236 మంది బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు సమాచారం. ఘజియాబాద్లోని కర్హేడా ప్రాంతంలో అక్టోబర్ 14న ఆ కుటుంబాల వారు హిందు మతాన్ని త్యజించి బాబా సాహెబ్ అంబేద్కరు ముని ముని మనవడు రాజరత్న సమక్షంలో వీరు బౌద్ధంలోకి మారారు. ‘హథ్రాస్ సంఘటనతో మేము బాధపడ్డాం. ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నాం. నాయకులు, అధికారులు మా బాధలు వినలేద’ని వారు ఆరోపించారు. సంబంధిత వీడియోలో రాజరత్న అంబేద్కర్ వారిని బౌద్ధ మతంలోకి ఆహ్వానించటాన్ని చూడవచ్చు. వీరందరు భారత బౌద్ధ సర్వసభ్య ధృవీకరణ పత్రాన్ని కూడా పొందారు.