కరోనా నివారణ నిధికి రూ.19.50 లక్షల ఆర్థిక సహాయం

కరోనా నివారణ నిధికి రూ.19.50 లక్షల ఆర్థిక సహాయం

హోసూరు : హోసూరు  క్రషర్స్ అసోసియేషన్ తరపున ముఖ్యమంత్రి కరోనా నివారణ నిధికి గాను రూ 19.50 లక్షల డిడిని కృష్ణగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. హోసూరు క్రషర్స్ అసోసియేషన్ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవల తమిళనాడు-కర్ణాటక సరిహద్దు జూజువాడి వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను టిప్పర్‌ ఢీకొనడంతో ఆయన సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కానిస్టేబుల్ సేటు కుటుంబానికి హోసూరు క్రషర్స్ అధ్యక్షుడు సంపంగి నేతృత్వంలో రూ.2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రబలుతున్న కరోనాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 19.50 లక్షల డిడిని సంపంగి నేతృత్వంలో కృష్ణగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రభాకరన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంపంగితో పాటు అసోసియేషన్‌కు చెందిన శ్రీనివాస్, ఆనంద్ కుమార్, మధు, ప్రేమ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos