మూడు బృందాలతో ఎన్నికలకు రెడీ

మూడు బృందాలతో ఎన్నికలకు రెడీ

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా, వివిధ అంశాలపై పార్టీ నేతలు సమాంతరంగా పని చేసేలా మూడు బృందాల్ని అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. రాజకీయ వ్యవహారాలు, పార్టీ సంస్కరణలపై ఇటీవల చింతన్శిబిర్లో తీసుకున్న ‘నవసంకల్ప్’ నిర్ణయం అమలుకు, ‘భారత్ జోడో యాత్ర బాధ్యతలు ఈ బృందాలకు అప్పగిం చారు. ఈ బృందాల్లో సీనియర్ కాంగ్రెస్ నేతలున్నారు. సోనియా ఆధ్వర్యంలోని పార్టీ వ్యవహారాల బృందంలో రాహుల్ సహా జీ23 నేతలైన గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్, నవసంకల్ప్ బృందంలో పి.చిదంబరం, ప్రియాంక గాంధీ వాద్రా సహా ముకుల్ వాస్నిక్, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, అజయ్ మేకన్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా, సునీల్ కనుగోలు, భారత్ జోడో యాత్ర బృందంలో సచిన్ పైలట్, దిగ్విజయ సింగ్, శశిథరూర్, రవ్నీత్ సింగ్ బిట్టు, కేసీ జార్జ్, జోతిమణి, ప్రద్యుత్ బోర్దోలోయ్, జితు పట్వారీ సహా సలీమ్ అహ్మద్ ఉన్నారు. ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు. గాంధీ జయంచి సందర్భంగా ఈ యాత్రను ప్రారంభించదలచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos