అసలే వరదలు…ఇక్కడి నుండి వెళ్లిపోండి

అసలే వరదలు…ఇక్కడి నుండి వెళ్లిపోండి

గువాహటి: అసలే వరదలతో అసోం ఉక్కిరిబిక్కిరి అవుతు న్నందున తక్షణమే ఇక్కడి నుంచి నిష్క్రమించాలని ఇక్కడ అనూయాయులతో మకాం చేసిన శివసేన తిరుగు బాట నేత షండేకు అసోం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా లేఖ రాసారు. ‘మీ మకాం రాష్ట్ర ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. అనారోగ్యకరమైన వాతా వరణాన్ని సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా అసోంను విడిచి వెళ్లాలి. ప్రభుత్వం ప్రజల గోడు పట్టించుకోకుండా మీకు రాచ మర్యాదలు చేయటంతో తలమునఖలైంది. వెంటనే వెళ్లి పోవాల’ని కోరారు. బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ”రాజకీయ బేరసారాలను ప్రోత్సహించే వీలర్-డీలర్”గా మారారంటూ బోరా మండి పడ్డారు. వరద సంక్షోభాన్ని ముందు చక్కబెట్టాలని ప్రభుత్వ యంత్రాంగానికి సూచించారు. ఏప్రిల్ 6 నుంచి 105 మంది వరదల్లో మృత్యువాత, 32 జిల్లాల్లోని 55 లక్షల మంది వరదల బారిన పడ్డారని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos