కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

హోసూరు : ఓ తమిళ వార పత్రికలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫోటోను ప్రచురించిన తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. హోసూరు సమీపంలోని రాయకోటలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొడ్డ మెట్రి హరీష అధ్యక్షతన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. తమిళ వార పత్రిక కుముదంలో తమ నాయకుని ఫోటోను అవమానపరిచే రీతిలో ప్రచురించారని, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి మనోభావాలు దెబ్బతిన్నాయని హరీష్ మండిపడ్డారు. కుముదం పత్రిక యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పత్రిక యాజమాన్యం దిగి రాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos