హోసూరు : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెద్దకోడిపల్లి పిల్లారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురికావడంతో హోసూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక ఆయన మృతి చెందారు.
పిల్లారెడ్డి మృతికి హోసూరు మాజీ ఎమ్మెల్యేలు గోపీనాథ్, మనోహరన్లతో పాటు పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవచేశారని కొనియాడారు. హోసూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఓ మంచి నాయకుని కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ పేర్కొన్నారు.