హొసూరు : క్రిష్ణగిరి జిల్లా హొసూరు యూనియన్లో ఈ నెల 27న తొలి విడత
ఎన్నికల పోలింగ్ జరుగనున్న సందర్భంగా కలెక్టర్ ప్రభాకర్ బుధవారం పోలింగ్ కేంద్రాలను, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
హొసూరు ఐటిఐ సమీపంలోని ఆర్ట్స్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన ఆయన, ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.