మునిగి పోయిన విపణి

మునిగి పోయిన విపణి

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల పాలయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ఇందుకు ప్రధాన కారణం. టెలికాం సూచీ మినహా మిగిలినవన్నీ నష్ట పోయాయి. సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయి 40,445కి, నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 11,914కి పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.61%), టాటా స్టీల్ (0 .53%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.25%), ఏసియన్ పెయింట్స్ (0.17%), టీసీఎస్ (0.05%) లాభాల్ని గడించాయి. యస్ బ్యాంక్ (-10.63%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.40%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.50%), టాటా మోటార్స్ (-3.07%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.81%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos