న్యూఢిల్లీ : ఆర్థిక నేరగాడు మోహుల్ చోక్సీని నిషేధిత వలసదారుగా ద్వీప దేశం-డొమినిక ప్రకటించింది. దీంతో ఛోక్సీని స్వదేశానికి రప్పించాలన్న భారత్ ప్రయత్నాలకు వెసలు బాటు కలిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కోట్లాది రూపాయాల మేర కుచ్చుటోపీ పెట్టి అంటిగ్వాకు పారిపోయిన చోక్సీ ఇటీవల అక్కడ నుంచి పారి పోయే ప్రయత్నంలో డొమినికా అధికారులకు దొరికాడు. ఆయన అక్రమంగా రానందున ఆయన్ను పోలీసులు అరెస్టు చేయలేరని చోక్సీ తరుపు న్యాయవాది విజరు అగర్వాల్ వాదనను డొమినికా సర్కార్ తోసిపుచ్చింది. స్వదేశానికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ ముఖ్యాధికారికి సూచించింది.