డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి సింగర్,డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని తప్పించడంపై తమిళ చిత్ర పరిశ్రమలో పలు అనుమానాలకు తావిస్తోంది.గతంలో మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మీటూ ఉద్యమంలో భాగంగా డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధారవితో పాటు మరికొంత మంది ప్రముఖులపై కూడా ఆరోపణలు చేశారు.ఇది జరిగిన కొద్ది రోజులుకు దక్షిణభారతదేశ సినీ టెలివిజన్ ఆర్టిస్ట్ డబ్బింగ్ యూనియన్కు చెల్లించాల్సిన ఫీజు చెల్లించక పోవడంతో యూనియన్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు గత ఏడాది నవంబర్లో నోటీసులు పంపించారు.తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మార్చ్15వ తేదీన హైకోర్టును ఆశ్రయించగా డబ్బింగ్ యూనియన్ నిర్ణయంపై స్టే విధించిన హైకోర్టు చిన్మయి దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 25వ తేదీ లోపు స్పందించాలంటూ రాధారవిని ఆదేశించింది.డబ్బింగ్ యూనియన్ తనపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని మీటూ ఉద్యమంలో స్పందించినందుకు తనపై రాధారవి ఇలా కక్ష్య తీర్చుకుంటున్నాడంటూ ఆరోపించింది. గతంలో రూ.2,500 చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్నా కూడా అదనంగా రూ.5వేలు అదనంగా డిమాండ్ చేశారని అందుకు ఎటువంటి రశీదు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.డబ్బింగ్ యూనియన్ నిర్ణయంపై న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు చిన్మయి..