చైనాలోని భారత వైద్య విద్యార్ధులకు షాక్‌

చైనాలోని భారత వైద్య విద్యార్ధులకు షాక్‌

న్యూఢిల్లీ: చైనా ద్య విశ్వవిదాలయాల్లో చదివే విద్యార్ధులు భారత దేశంలో హౌస్ సర్జన్ చేసేందుకు కేంద్రం నిరాకరించింది. ఆరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసిన వారికి మాత్రమే విదేశీ వైద్య పట్టభద్ర పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపింది. కేంద్రం నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేసారు. ప్రతి ఏటా నాలుగైదు వేల మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. రష్యా, ఉక్రెయిన్, బల్గెరియా, ఫిలిఫైన్స్, ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు ఆరేళ్లు చదవాల్సి ఉంటుంది. ఆ కోర్సు అనంతరం కేంద్రం నిర్వహించే పరీక్షలో విద్యార్ధులు అర్హత సాధించి ఏడాదిపాటు హౌస్ సర్జన్ భారతదేశంలో చేయాలి. చైనాలోనూ ఎంబీబీఎస్ ఆరేళ్లు. అయితే ఐదేళ్లు కోర్సు పూర్తి చేసిన తర్వాత చివరి ఏడాది భారత్లో హౌస్ సర్జన్ చేసుకోవడానికి అవకాశం ఉండేంది. భారత ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇక ఆ అవకాశం లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos