న్యూ ఢిల్లీ : తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ శుక్రవారం ఇక్కడి ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలోహస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. చెరుకు సుధాకర్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన రాకను ఆహ్వానించి నట్లు చెప్పారు. చెరుకు సుధాకర్కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసే విషయంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. చలమల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్లో ఒకరిని ప్రకటించే యోచనలో ఉంది. నేడు జరగనున్న మునుగోడు సమావేశంలో అభ్యర్థిని అధికారంగా ప్రకటించే అవకాశముంది.eruku