చెంగు వీర అయిన అభినయ చే గువేరా

చెంగు వీర అయిన అభినయ చే గువేరా

అమరావతి: చే గువేర తనకు ఆదర్శమని వల్లించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెంగువీర అయ్యారని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ గురువారం ఇక్కడ విమర్శించారు. భాజపాతో ఎందుకు కలుస్తున్నారో తెలపాలని పవన్ను డిమాండ్ చేసారు. రాష్ట్రానికి పత్యేక హోదా ఇస్తామని చెప్పి పాచిపోయిన లడ్డూలను ఇచ్చిందని భాజపాను గతంలో విమర్శించిన పవన్కు ఢిల్లీలో నడ్డాను కలిసిన తర్వాత బందరు లడ్డూలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లిన నేతలంతా అక్కడి జావహర్లాల్ విశ్వ విద్యాలయానికి వెళుతుండగా కేవలం పవన్ మాత్రమే కాషాయ కార్యాలయానికి వెళ్లారని ఎగతాళి చేసారు. ‘చేగువేర తనకు ఆదర్శమని చెప్పుకున్న పవన్ ఇప్పుడు చెంగువీర అయ్యాడు. కేవలం దమ్మున్నవారే భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడగలరు. పవన్ కు దమ్ముందో, లేదో సమాధానం చెప్పాల’ని నిలదీశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos