న్యూ ఢిల్లీ: చార్ధామ్ యాత్రలో తెలుగు యాత్రికులు మోసపోయారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది ప్రయాణికులను హెలికాప్టర్ టికెట్ బుకింగ్ పేరుతో మోసం చేశారు. ఒక్కొక్కరికి అదనంగా రూ. 30 వేలు చెల్లించినప్పటికీ టికెట్ బుక్ అవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించారు.శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గకి చెందిన యాత్రికులు చార్ధామ్ యాత్రకు వెళ్లారు. చార్ధామ్ యాత్రలో భాగంగా తొలుత గంగోత్రిని సందర్శించారు. తర్వాత యాత్రికులు కేదార్ లోయకు చేరుకున్నారు. కానీ ఒక్కొక్క టికెట్కు ముప్పై వేల రూపాయలు చెల్లించినప్పటికీ, వారికి హెలికాప్టర్ టికెట్లు లభించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన భాధితులు, వారు నివాసం ఉంటున్న రత్నాకర్ గుప్తకాశీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ జరిగింది: బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, తామంతా ఒక బృందంగా ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు బయలుదేరినట్లు చెప్పారు. ప్రయాణ ప్యాకేజీతో పాటు, కేదార్నాథ్ ధామ్కు హెలికాప్టర్ టికెట్ కోసం ఒక్కొక్కరికి ₹15,000 చొప్పున డబ్బు కూడా తీసుకున్నారని తెలిపారు.గుతున్న చార్ధామ్ యాత్రలో తెలుగు యాత్రికులు మోసపోయారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది ప్రయాణికులను హెలికాప్టర్ టికెట్ బుకింగ్ పేరుతో మోసం చేశారు. ఒక్కొక్కరికి అదనంగా రూ. 30 వేలు చెల్లించినప్పటికీ టికెట్ బుక్ అవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గకి చెందిన యాత్రికులు చార్ధామ్ యాత్రకు వెళ్లారు. చార్ధామ్ యాత్రలో భాగంగా తొలుత గంగోత్రిని సందర్శించారు. తర్వాత యాత్రికులు కేదార్ లోయకు చేరుకున్నారు. కానీ ఒక్కొక్క టికెట్కు ముప్పై వేల రూపాయలు చెల్లించినప్పటికీ, వారికి హెలికాప్టర్ టికెట్లు లభించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన భాధితులు, వారు నివాసం ఉంటున్న రత్నాకర్ గుప్తకాశీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ జరిగింది: బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, తామంతా ఒక బృందంగా ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు బయలుదేరినట్లు చెప్పారు. ప్రయాణ ప్యాకేజీతో పాటు, కేదార్నాథ్ ధామ్కు హెలికాప్టర్ టికెట్ కోసం ఒక్కొక్కరికి ₹15,000 చొప్పున డబ్బు కూడా తీసుకున్నారని తెలిపారు.