అదే జరిగితే తెరాసకు చుక్కలే..

అదే జరిగితే తెరాసకు చుక్కలే..

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి త్వరలో కాషాయం బ్యాచ్ లో చేరడానికి రెడీ అవుతున్నారనే వార్తలు టీకాంగ్రెస్ లో చిన్నపాటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. దుబ్బాకలో హాట్‌హాట్‌గా ఉప ఎన్నికల ప్రచారపర్వం జరుగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయమని పిలుపు ఇవ్వలేదు.తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత బలోపేతం కావటమే కాదు.. టీఆర్ఎస్ కు చెక్ పెట్టటమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందితెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ ఇంటికి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లటం.. భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో సొంత గూటికి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించినట్టు సమాచారం. వీరిద్దరి భేటీ తరువాత బండి సంజయ్ అరెస్టును విజయశాంతి ఖండించారు. దీంతో విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణాలో పార్టీ పుంజుకుంటుదని బీజేపీ నేతలు ఆశ పడుతున్నారు. అధిష్ఠానం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదిగిన తెరాసను అడ్డుకోవడానికి భారతీయ జనతాపార్టీ అనుకూలమైన అన్ని మార్గాలను వినియోగించుకుంటూ ఆపరేషన్ కమలంకు తెరలేపుతున్నట్టు కనిపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos