హైదరాబాద్ : కర్ణాటకలోని బీదర్ నుంచి కేంద్ర పారామిలటరీ, ఇతర బలగాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. దాదాపు 80 వాహనాలలో ఈ బలగాలు జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, క్రాస్రోడ్, పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుమీదగా హైదరాబాద్ చేరుకున్నాయి. కేంద్రం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ బలగాలు రాష్ట్రానికి వచ్చాయి. బలగాలు కావాలని తాము కేంద్రాన్ని కోరలేదని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. సాధారణ ప్రక్రియలో భాగంగా వారు ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు.